కర్నూలు మహర్షి సినిమా షో లో గొడవ

Update: 2019-05-11 10:52 GMT

థియేటర్‌లో ఏసీ పనిచేయడం లేదని కర్నూలులో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. మహర్షి మార్నింగ్‌ షోకి వెళ్లిన ఆడియన్స్‌ ఏసీ పనిచేయక అసౌకర్యానికి గురయ్యారు. ప్రేక్షకులు గగ్గోలు పెట్టినా థియేటర్‌ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో సినిమా పూర్తైన తర్వాత బయటకు వెళ్లకుండా థియేటర్‌లోనే బైఠాయించారు‌. అధిక మొత్తంలో టిక్కెట్‌ డబ్బులు వసూలు చేస్తూ, సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. 

Similar News