సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి గెలుపు

Update: 2019-05-23 11:21 GMT

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌పై 51,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కిషన్ రెడ్డికి 42.3 శాతం ఓట్లు దక్కగా, సాయికిరణ్‌కు 34.9 శాతం, అంజన్ కుమార్ యాదవ్‌కు 18.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఈసారి కిషన్ రెడ్డి గెలవడం, కేంద్రంలో కూడా బీజేపీ అధికారాన్ని చేపట్టనుండడంతో మరోసారి సికింద్రాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో కూడా 2014లో బండారు దత్తాత్రేయ ఈ స్థానం నుంచి గెలిచారు .. 

Similar News