ఐదు కోట్ల మంది ప్రజల్లో ఒక్క మనిషికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. నాకు ప్రజలందరి ఆశీస్సులతో దేవుడు ఈ అవకాశం కల్పించాడు. అందుకే మీ అందరితో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నారు. నవరత్నాల అమలు నా తొలి ప్రాధాన్యం అని చెప్పారు. పాద యాత్రలో ప్రజల కష్టాలు చూసా.. బాధల్ని విన్నా.. నేను చూశా.. నేను వున్నా.. ఒక్క సంతకం కాదు నవరత్నాలను తీసుకు వచ్చే పాలన ఇవ్వబోతున్నాను అని చెప్పారు. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను, విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రజలు నా పట్ల విశ్వాసంతో ఓటు వేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ప్రమాణ స్వీకారం విజయవాడలోనే.. ౩౦వ తేదీన నిర్వహిస్తారని ప్రకటించారు.