నవ్యంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి అభినందనలతో ప్రశంశాలూ వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జగన్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు ఆ వరుసలో సినీ నటుడు మోహన్ బాబు చేరారు. అయన ట్విట్టర్ వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. "జగన్ కు తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. జగన్ తన తండ్రి వైఎస్సార్ ను మించి గొప్పవాడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని పర్యాయాలు జగనే సీఎంగా ఉంటాడు" అంటూ ట్వీట్ చేశారు.