ఐటీ గ్రిడ్‌పై మరో కేసు నమోదు

Update: 2019-03-04 05:42 GMT

నలుగురు ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను మాదాపూర్ పోలీసులు ఇవాళ ఉదయం హైకోర్టు జడ్జి జస్టిస్‌ చౌహాన్‌ ఎదుట హాజరుపర్చారు. బేగంపేట్‌ కుందన్‌బాగ్‌లోని జడ్జి నివాసానికి భాస్కర్, ఫణి, విక్రమ్‌గౌడ్, చంద్రశేఖర్‌లను పోలీసులు తీసుకెళ్లారు. తమ కంపెనీ ఉద్యోగులను పోలీసులు తీసుకెళ్లారని, వారి వివరాలు తెలపడం లేదంటూ ఐటీ గ్రిడ్ కు చెందిన ఓ ఉద్యోగి హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో పోలీసులు వీరిని జడ్జి ఎదుట హాజరుపరిచారు.

Similar News