కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్...

Update: 2019-02-16 07:35 GMT

తెలుగుదేశం పార్టీకి కర్నూల్‌ జిల్లాలో భారీ షాక్‌ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ సీనియర్‌ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆయన సోదరుడు ప్రతాప్‌ రెడ్డి.. వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాంపుల్లారెడ్డి సోదరులు కలిశారు. రాంపుల్లారెడ్డి సోదరులకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Similar News