మోడీ మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఈ సాయంత్రం కేంద్రమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రివర్గంలో తనకు చోటు దక్కిందంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ ప్రజలు, ప్రధాని మోదీ ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. మీరెప్పుడూ ఇలాగే మద్దతు ఇవ్వాలంటూ ఆయన ట్వీట్ చేశారు. మోదీ రెండవ సారి ఇవాళ రాత్రి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
With the blessings of people of Secunderabad & Hon PM @narendramodi Ji I will be taking oath as Union Minister today at 7pm.
— G Kishan Reddy (@kishanreddybjp) May 30, 2019
I seek your continued support. pic.twitter.com/oqHfVXXnKQ