ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ తెలుగుదేశం ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కేవలం 23సీట్లతో సరిపెట్టుకుంది. అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151సీట్లతో జయకేతనం ఎగురవేశాడు. కాగా ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా నారా చంద్రబాబుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశాడు. టీడీపీ అధినేత నారా చంద్రబాబును పోలిన వ్యక్తి హోటల్లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ప్రస్తుతం నారా చంద్రబాబు పరిస్థితి ఇదీ రాంగోపాల్ వర్మ అంటూ ట్వీట్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం సరిపోయే వ్యక్తి దొరికాడని వర్మ గతంలో షేర్ చేసిన వీడియోనే తాజాగా మరోసారి ట్వీట్ చేసి బాబుపై సెటైర్లు వేశాడు. ఏపీలో సైకిల్ టైర్ పంక్చర్ అయిందని, పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారని రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
Present position pic.twitter.com/gXB0wpmyTn
— Ram Gopal Varma (@RGVzoomin) May 24, 2019