వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు తప్పని చిక్కులు...హిందూపురం బరిలో...

Update: 2019-03-23 06:38 GMT

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు చిక్కులు తప్పటం లేదు. మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఉన్నతాధికారులు ఆదేశించినా అధికారులు రిలీవ్ చేయలేదు. దీంతో మాధవ్ పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ను కలిశారు గోరంట్ల మాధవ్. హిందూపురం నుంచి తన భార్య సవితను పోటీలోకి దింపాలని మాధవ్ కోరారు. ఇందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. మాధవ్ ను రిలీవ్ చేయనట్లయితే ఈనెల 25న సవిత నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు.

Similar News