కామారెడ్డి జిల్లాలో విషాదం...వరికుప్పపై ప్రాణాలు విడిచిన రైతు

Update: 2019-05-08 06:51 GMT

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన అన్నదాత అమ్మేందుకు వచ్చి కుప్పకూలిపోయిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు గోపాల్‌ తాను తెచ్చిన ధాన్యం కుప్పపైనే ప్రాణాలు కోల్పోయాడు

లక్ష్మాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రెండు రోజుల కిందట చేరుకున్న రైతు గోపాల్‌ తాను తెచ్చిన ధాన్యాన్ని అమ్మేందుకు పడిగాపులు కాస్తున్నారు. అయినా కొనుగోలు కేంద్రం అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండురోజులుగా మండుటెండలో అలాగే ఎదురుచూశారు. చివరకు వడదెబ్బ తగలడంతో రైతు గోపాల్‌ తాను తెచ్చిన ధాన్యం కుప్పపైనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో గోపాల్‌ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

Similar News