నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంపై ఈసీ నిర్ణయం ఇదే

Update: 2019-03-29 07:24 GMT

నిజామాబాద్ పార్లమెంట్ పోరు ఉత్కంఠగా మారింది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 178 మంది రైతులు ఉన్నారు. బ్యాలెట్‌ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే అభ్యర్థుల వివరాలను తెలపాలని రిటర్నింగ్‌ అధికారికి ఈసీ ఆదేశించింది. బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు పెద్ద కష్టమేమీ కాదనీ ఈసీ పేర్కొంది. 1996, 2010, 2019లో పలు సందర్భాల్లో బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించామని ఈసీ గుర్తుచేసింది.

Similar News