ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి

Update: 2019-05-17 06:42 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లోని ఉపాధ్యాయ విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు వీటిని ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌కు 14,019 మంది దరఖాస్తు చేయగా పరీక్షకు 11,650 మంది హాజరయ్యారు. మే 6న ఆంధ్రప్రదేశ్‌లో 16 ప్రధాన పట్టణాల్లోని 56 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈసారి ఎడ్‌సెట్ నిర్వహణ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం చేపట్టింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో పురుషులు 4,488 మంది ఉండగా.. మహిళలు 9,531 మంది ఉన్నారు. 

Similar News