ఏపీ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠకు తెర

Update: 2019-05-13 13:49 GMT

ఏపీ కేబినెట్ భేటీపై సందిగ్ధం వీడింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికలు సంఘం గ్రీన్‌సిగ్నలిచ్చింది. కేబినెట్ నిర్వహణపై 4 అంశాలతో కూడిన నోట్‌ను సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ సీఈసీకి పంపింది. తాజాగా కేబినెట్ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదం తెలిపింది. కరువు, ఫొని తుఫాన్, తాగునీరు, ఉపాధిహామీ అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేబినెట్ మీటింగ్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు.

Similar News