భాగ్యనగరంలో డ్రగ్స్ కలకలం.. ఈ డ్రగ్ మహిళలపై ప్రయోగిస్తే...

Update: 2019-05-03 13:23 GMT

హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్ అడ్డాగా గత ఐదేళ్లుగా నడుస్తున్న డ్రగ్ తయారీ కేంద్రాన్ని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారవుతున్న డ్రగ్స్‌ను మహిళలపై ఉపయోగిస్తున్నట్టు విచారణలో తేలింది. కెటమైన్ అనే మత్తు మందును నాచారంలోని ఇంతం ల్యాబ్‌లో తయారవుతున్నట్టు గుర్తించారు. బెంగళూరులో పట్టుబడిన ముఠా ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఇంతం ల్యాబ్‌లో తనిఖీలు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల 5గంటలపాటు అపస్మారక స్థితిలోకి వెళ్తారని, మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగేలా ఇది తయారు చేస్తున్నట్టు తేలింది. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుగా ఈ వ్యవహారాన్ని ఇంతం ల్యాబ్ యజమాని వెంకటేష్ నడుపుతున్నట్టు అధికారులు నిర్ధారించారు.  

Full View

Similar News