జగన్ పాదయాత్రపై దేవినేని ఉమా ఎద్దేవా

మార్నింగ్, ఈవినింగ్‌ వాక్‌లతో మధ్యలో కోర్టు వాయిదాలతో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందని మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.

Update: 2019-01-09 12:11 GMT

మార్నింగ్, ఈవినింగ్‌ వాక్‌లతో మధ్యలో కోర్టు వాయిదాలతో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందని మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. అనంతపురంలో జరిగిన జన్మభూమి మా వూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్ హయాంలో ఆయన తనయుడు జగన్ చేసిన అవినీతి వల్ల ఎందరో ఐఏఎస్ అధికారులు జైలు పాలు కావలసి వచ్చిందన్నారు. అలాంటి అవినీతిపరుడు నాయకుడైతే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ఉమా ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి చంద్రబాబుయే అధికార పగ్గాలు చేపట్టనున్నారని అన్నారు.  

Similar News