'వైసీపీలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నాం'

Update: 2019-01-27 10:33 GMT

తాము వైసీపీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. కుమారుడితో కలిసి వైసీపీ అధినేత జగన్‌తో భేటి అయిన ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. వైసీపీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని దగ్గుబాటి అన్నారు. ఏపీలో పాలన గాడి తప్పిందని ప్రజల సొమ్మును దీక్షల పేరుతో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని దగ్గుబాటి ఆరోపించారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. తన భార్య పురందశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

Similar News