మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన...పట్టుకుని చితకబాదిన...

Update: 2019-05-07 11:31 GMT

నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం రంజిత్‌ నాయక్‌ తండాలో కానిస్టేబుల్‌ వీరంగం సృష్టించాడు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మధ్యం సేవించి తాగిన మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానిక తండా వాసులు కానిస్టేబుల్‌ను చితక్కొట్టారు. ఇటు సమాచారం అందుకున్న పోలీసులు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా విచారణ చేపట్టిన ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌ కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Full View

Similar News