వైసీపీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు: కిషోర్‌ చంద్రదేవ్

Update: 2019-02-12 12:04 GMT

త్వరలో టీడీపీలో అధికారికంగా చేరతానని చెప్పారు మాజీ కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. వైసీపీ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్న ఆయన ఆ పార్టీ సిద్ధాంతాలేంటో కూడా తెలియవన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి వైసీపీనే కారణమని చెప్పారు. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌ హయాం నుంచి టీడీపీతో తనకు పరిచయాలు ఉన్నట్టు తెలిపారు. 

Similar News