కాంగ్రెస్‌ నాలుగో జాబితా విడుదల..

Update: 2019-03-17 03:47 GMT

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇందులో 27 మంది అభ్యర్థులకు చోటు దక్కింది. వీరిలో కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ తిరువనంతపురం నుంచి బరిలోకి దిగుతారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రెండు స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో ఐదింటికి, కేరళలో 12 సీట్లకు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు, అండమాన్‌ నికోబార్‌ దీవుల స్థానానికి అభ్యర్థులను కాంగ్రెస్‌ ఖరారు చేసింది. 

Similar News