పిడిగుద్దులతో కాంగ్రెస్ కార్యకర్తల యుద్ధం
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లాలో పార్టీ ఓటమిపై సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లాలో పార్టీ ఓటమిపై సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. సాజిద్ ఖాన్ వర్గానికి చెందిన నాయకులు స్టేజ్పైనే బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులతో మరో వర్గంపై రెచ్చిపోయారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా నిలిపేశారు. మిగతా నాయకులు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.