కాంగ్రెస్‌ తొలిజాబితా రిలీజ్‌

Update: 2019-03-08 04:29 GMT

సార్వత్రిక ఎన్నికలకు తాము సిద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. నోటిఫికేషన్‌ విడుదలకు ముందే తొలి విడత జాబితాను ప్రకటించింది. మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 స్థానాలు, గుజరాత్‌లో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అమేథి నుంచి రాహుల్‌గాంధీ, రాయ్‌బరేలి నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తున్నారు. అయితే తొలిజాబితాలో మాత్రం ఆ పార్టీ కార్యదర్శి ప్రియాంకాగాంధీ పేరు మాత్రం కనిపించలేదు. ఉత్తరప్రదేశ్‌ తూర్పు నియోజకవర్గాలకు ప్రస్తుతం ఆమె ఆ పార్టీ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు.


Similar News