ఇంటర్ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం...పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరికీ ...
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. వివాదాలకు తావులేకుండా పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.