ఏపీలో ఎన్నికల ప్రచారం తారా స్ధాయికి చేరుకుంది. రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల అధినేతలతో పాటు అభ్యర్ధులు, పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ రోజు కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించున్న ఆయన మూడు గంటలకు పామర్రులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఐదు గంటలకు పెడనలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మచిలీపట్నంలో రోడ్షో నిర్వహిస్తారు.
చంద్రబాబు సుడిగాలి ప్రచారం
తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం
మధ్యాహ్నం 12.00 గంటలకు తిరువూరు
మధ్యాహ్నం 3.00 గంటలకు పామర్రు
సాయంత్రం 5.00 గంటలకు పెడన
రాత్రి 7.00 గంటలకు మచిలీపట్నంలో రోడ్షో