లేటెస్ట్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం అవుతోంది : చంద్రబాబు

లేటెస్ట్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం అవుతోంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ సహకారం అందిస్తోంది అని చెప్పారు.

Update: 2019-01-10 09:58 GMT

లేటెస్ట్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం అవుతోంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ సహకారం అందిస్తోంది అని చెప్పారు. అమరావతిలో వెల్‌కమ్ గ్యాలరీ కి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడిదారులు, పలువురు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. చాలా విషయాల్లో సింగపూర్ ను ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటుందని వెల్లడించారు. గ్యాలరీ నిర్మాణం సింగపూర్ సహకారంతోనే ప్రారంభించమని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే బిగ్ డేటా సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అదాని గ్రూప్ ఏర్పాటు చేస్తుందన్నారు. రాజధాని నిర్మాణం ఒక అద్బుతమూన అవకాశమని చంద్రబాబు అన్నారు. 

Similar News