నేరగాళ్ల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో కేసీఆర్కి ఏంటి సంబంధమేంటన్న ఆయన బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తన ప్రాణం ఉన్నంతవరకూ ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. వైసీపీ 8 లక్షల ఓట్లను తొలగించిందన్నారు. ఆస్తులు రక్షించుకోవడానికే జగన్ హైదరాబాద్లో ఉంటున్నారని, ఆర్థిక టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.