పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒంగోలు నేతలతో రివ్యూ నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్తో సహా ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేశారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో దృష్టిపెట్టారు. అయితే ఒంగోలు ఎంపీగా తాను పోటీ చేయనని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చంద్రబాబుకి తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే టికెట్ లేదా నెల్లూరు ఎంపీ సీటు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.