వైసీపీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌

Update: 2019-03-11 11:15 GMT

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకావడంతో పార్టీలో హడవుడి మొదలైంది. చేరికలతో మరింత ఊపుమీద ఉన్నాయి. ఎన్నికలు 30రోజులు ఉండడంతో వైసీపీ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శివరామ సుబ్రహ్మణ్యంకి పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పలువురు నేతలు పెద్దఎత్తున పార్టీలో చేరారు.  

Similar News