పాస్టర్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయాలి : రాజాసింగ్

Update: 2019-05-28 13:51 GMT

అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన పాస్టర్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయాలని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మంచిర్యాలలో డిమాండ్ చేశారు. సోమగూడెం కల్వరి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రార్థనలతో రోగాలను నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడని అన్నారు. మంగమ్మ కొడుకును బలి తీసుకున్న ప్రవీణ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ప్రవీణ్ అరాచకాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. పాస్టర్‌ను అరెస్ట్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. 

Similar News