మొన్న ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమిపాలు అయిన సంగతి మనకి తెలిసిందే అయితే ఈ గెలుపుకి భారత్ అభిమానులు సంబరపడుతుంటే పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అ జట్టు ఓటమికి గాను అ జట్టు కెప్టైన్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు . ఇందులో భాగంగా ఓ అభిమాని పాక్ జట్టును నిషేధించాలంటూ కోర్టుని ఆశ్రయించాడు.. అంతేకాకుండా జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ కూడా బాధ్యత వహించాలంటూ పంజాబ్ ప్రావిన్స్లోని గుజ్రన్వాలా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారించి.. దీనిపై నివేదికలు అందించాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశమై బుధవారం పీసీబీ సమావేశం కానుంది.