కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు...ముందస్తు బెయిల్ నిరాకరించిన....
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కొండాకు ముందస్తు బెయిల్ను కోర్టు నిరాకరించింది. ఎస్.ఐ , హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన ఘటనలో కొండా విశ్వేశ్వర్రెడ్డిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. వారం రోజులుగా విశ్వేశ్వర్ రెడ్డి కోసం బంజారాహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు.