మోడీ ట్వీట్స్‌కు చంద్రబాబు కౌంటర్

Update: 2019-04-01 07:12 GMT

ఏపీలో అవినీతి పాలన సాగుతోందన్న ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అవినీతి అక్రమాలకు సహకరిస్తూ అవినీతి అక్రమార్కులతో అంటకాగుతూ లక్ష కోట్లు దోచుకున్న ఆర్ధిన నేరస్ధుడికి అండగా నిలుస్తున్న మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తోందని ఘాటుగా విమర్శించారు.

మీ దుర్మార్గ పాలనకు దేశ ప్రజలు చరమగీతం పాడుతారంటూ ట్వీట్ చేశారు. అమరావతి నిర్మాణానికి సాయం చేయకుండా మట్టి,నీరు ముఖాన కొట్టి ఇప్పుడు మాట్లాడటానికి సిగ్గుగా లేదా ? అంటూ ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని హోదాతో రాష్ట్రాన్ని ఆదుకుంటామన్న హామీలు ఏమయ్యాయని బాబు కౌంటరిచ్చారు. నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామన్న హామీలు ప్రశ్నించారు. త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Similar News