రీపోలింగ్పై సీఈవో ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రగిరి రీ పోలింగ్ నిర్ణయం సరైందేనని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ద్వివేది వీడియో ఫూటేజీ చూస్తే ఆయా కేంద్రాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. భారీగా అక్రమాలు జరిగాయని రిగ్గింగ్కు పాల్పడినట్లు అర్థం అయ్యిందని ద్వివేదీ అన్నారు. పోలింగ్ సక్రమంగా జరగలేదనే నిర్ధారణకు వచ్చాకే పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశామని అక్కడి అధికారులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసినట్లు తెలిపారు.