వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని మోడీ మరోసారి ప్రధాని అవుతారన్నారు మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు. దేశవ్యాప్తంగా ప్రజలు అదే కోరుకుంటున్నారని తెలిపారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు స్పష్టంచేశారు.