దుబాయ్లోని రశీదియ ఎగ్జిట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు మృతుల వివరాలను ఇండియన్ కాన్సులేట్ వెల్లడించింది. భారత్కు చెందిన మృతుల పేర్లు రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్రామ్ జవహార్ ఠాకూర్.