ఆ నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మాజీ సీఎం హెచ్చరిక

కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో, కీలకమైన కాంగ్రెస్ బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కాని ఈ సమావేశానికి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మకొట్టారు.

Update: 2019-01-18 12:49 GMT

కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో, కీలకమైన కాంగ్రెస్ బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కాని ఈ సమావేశానికి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మకొట్టారు. దీంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా ఈ సీఎల్పీ సమావేశానికి రమేశ్ జార్ఖోలి, మహేష్ కుమ్మత్ హలి, ఉమేశ్ జాదవ్, బి. నాగేంద్ర డుమ్మా కొట్టారు. సమావేశానికి రానివారిపై వేటేస్తామని మాజీ సీఎం సిద్ద రామయ్య హెచ్చరించారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోల్పోతారని ఘాటుగా హెచ్చరించారు.

Similar News