త్రిసభ్య కమిటీ నివేదికలో సంచలన విషయాలు...

Update: 2019-04-27 08:09 GMT

సంచలన విషయాలను వెల్లడిస్తూ ఇంటర్ ఫలితాలపై ఏర్పాటు చేసిన త్రిసభ్యకమిటీ నివేదికను అందజేసింది. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం, గ్లోబరీనా చేతకాని తనం కారణంగానే వివాదాలు చోటు చేసుకున్నాయంటూ కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. ఇదే సమయంలో గ్లోబరీనా వల్లే సాంకేతిక సమస్యలు వచ్చి ఫలితాల వెల్లడిలో గందరగొళం తలెత్తినట్టు తెలిపింది. ఇకపై భవిష్యత్‌లో టెండర్ల ఖరారు సమయంలో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఇంటర్ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో వ్యవహరించాల్సిన తీరుపై నివేదిక అందజేశారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డికి నివేదిక అందజేశారు. 

Full View

Similar News