నిర్మల్ జిల్లా గొడిసెర్యాల్ గ్రామంలో దారుణం జరిగింది. తమ కులం అభ్యర్థికి ఓటు వేయలేదని ఇరవై కుటుంబాలను బహిష్కరించారు. సర్పంచ్ ఎన్నికల్లో గొడిసెర్యాల్ గ్రామంలో ఓ కులానికి చెందిన అభ్యర్థి పోటీ చేశాడు. అయితే ఆ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ గ్రామంలోని తమ కులస్తులే అతని ఓటమికి కారణమని భావించారు. కుల పెద్దలంతా కలిసి వారిని గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులకు, స్థానిక ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపడుతున్నారు.