వారణాసిలో రైతులకు షాక్

Update: 2019-05-02 05:38 GMT

వారణాసిలో ఆర్మూర్ పసుపు రైతులకు చుక్కెదురయింది. నామినేషన్ల పరిశీలనలో 24 మంది రైతుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎర్గాట్ల మండలానికి చెందిన ఒకే ఒక రైతు ఇస్తారి నామినేషన్ మాత్రమే ఆమోదం పొందింది. దీంతో పసుపు రైతులు ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 3న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. వారణాసి ఎన్నికల సంఘం అధికారులపై ఫిర్యాదు చేయనున్నారు. 

Similar News