బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకింది. నిన్న సాయంత్రం సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్దారించారు. ఈ విషయాన్ని అమిత్ షానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భగవంతుడి దయ, కార్యకర్తల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని ట్వీట్ చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అమిత్ షాను ఆసుపత్రిలో పరామర్శించారు.