దుర్గాదేవి విగ్రహం నిమజ్జనంలో విషాదం... నదిలో 10మంది గల్లంతు
రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. ధోల్పూర్ దుర్గాదేవి నిమజ్జనంలో నీటిలో 10మంది గల్లంతయ్యారు. పర్బతి నదిలో అమ్మవారి విగ్రహాం నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 యువకులు కొట్టకుపోయ్యారు.
రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. ధోల్పూర్ దుర్గాదేవి నిమజ్జనంలో నీటిలో 10మంది గల్లంతయ్యారు. పర్బతి నదిలో అమ్మవారి విగ్రహాం నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 యువకులు కొట్టకుపోయ్యారు. పర్భతి నది ఎక్కువగా పొంగి పోర్లుతుండడంతో వారంతా కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ధోల్పూర్ కలెక్టర్ రాకేశ్ జైశ్వల్ మాట్లాడుతూ... నదిలో గల్లంతైయిన వారిలో ఏడుగురి మృతదేహాలు బయటపడ్డాయన్నారు. మరో మూడు మృతదేహాలను బయటకు తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.మరణిచిన వారి కుంటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లక్షరూపాయిలు పరిహారం అందిస్తున్నాట్లు పేర్కొన్నారు.