భారత్‌ పెట్టుబడులకు అనువైనది..బ్లూమ్‌బర్గ్ సదస్సు వేదికగా మోడీ పిలుపు

Update: 2019-09-25 15:42 GMT

భారతదేశంలో అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోడీ తెలిపారు. న్యూయార్క్‌లోని బ్లూమ్‌బర్గ్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో ప్రసంగించిన మోడీ ఇటీవల కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్నకొన్ని కీలక నిర్ణయాలను వివరించారు. రెస్టోరింగ్‌ గ్లోబల్‌ స్టెబిలిటీ అనే అంశంపై మోడీ తన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, IMF మాజీ చీఫ్ క్రిస్టియన్ లగార్డేతో పాటు ఫార్ట్యూన్‌ 500 కంపెనీల సీఈఓలు హాజరయ్యారు.

Tags:    

Similar News