కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అల్మటీ నగరంలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన బెక్ ఎయిర్కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100మంది ఉన్నారు. వీరిలో 95మంది ప్రయాణికులు కాగా ఐదుగురు సిబ్బంది.
ఈ దుర్ఘటనలో 14 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు. రాజధాని నగరమైన నూర్ సుల్తాన్కు వెళ్తుండగా రెండతస్తుల భవనాన్ని విమానం ఢీకొని కుప్పకూలినట్టు కజకిస్థాన్ సివిల్ ఏవియేషన్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యవసర సేవలను రంగంలోకి దింపి, ప్రయాణికులను వెలికి తీస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.