అత్యధిక అప్పులు చేసిన దేశంగా పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక పక్క పాకిస్తాన్ లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న వేళలో.. మరోపక్క ఆర్ధిక సహాయం కోసం పలు దేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ తిరుగుతున్న సమయంలో ఓ నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే 7,509 బిలియన్ల పాకిస్తానీ రూపాయల అప్పులు చేసింది. స్థానిక మీడియా లో వచ్చిన ఓ కథనం ప్రకారం పాకిస్తాన్ అప్పులకు సంబంధించిన నివేదిక ఒకటి స్టేట్ బ్యాంక్ ఇఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది.
దీని ప్రకారం.. 2018 అగస్టు మంచి 2019 అగస్టు వరకు పాక్ ప్రభుత్వం విదేశాల మంచి రూ.2,804 బిలియన్ల మేర అప్పులు తీసుకోగా... దేశీయంగా రూ. 4.705 బిలియన్ల జప్పు చేసినట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు 1.43 శాతం పెరిగినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టులో రుణాలు రూ.24,732 బిలియన్లు ఉండగా... ఈ ఏడాది ఆగస్టులో అప్పులు రూ.32,240 బిలియన్లుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి జైమాసికంలో 1 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయల మేర పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇమ్హాన్ ప్రభుత్యం రూ. 960 బిలియన్ల మేర పన్నులు వసూలు చేపింది. మరోవైపు ఈ ఏడాది 2019 నాటికి పాకిస్తాన్ అప్పులు మొత్తం 31.786 బిలియన్లకు చేరుకుంది. దీనికి ఇదనంగా మరో ఐదేళ్లబో 47 శాతం అంటే 45.57 ట్రిలియన్లకు పాకిస్తాన్ అప్పులు పెరగనున్నట్టు ప్రభుత్యం పేర్కొంది.
ఇప్పటికే పలు దేశాలు పాకిస్తాన్ను బెయిలవుట్ ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ...ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడకపోవడం గమనార్హం. ఈ ఏడాది జూన్లో ఖతార్ నుంచి పాకిస్తాన్ 3 బ్రిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజ అందుకుంది. గత 11 నెలల్లో పాకిస్తాన్ జర్జిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చిన గల్ఫ్ దేళాల్లో ఖతార్ నాలుగోది. అంతకు ముందు యూఏఈ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మేర సామ్ములు సమకూర్చింది. సంక్షోభంలో కూరుకుపోయిన తమ ఇర్జిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్యం మరోవైపు 6 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకుంది.