Iran US War: ఇంకా పూర్తి యుద్ధం మొదలవలేదు.. ముందుంది అసలు కథ అంటున్న ట్రంప్
Iran US War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ - ఇజ్రాయేల్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా అసలు యుద్ధం మొదలు కాలేదన్నారు. ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం అప్ డేట్స్
Iran US War
Iran US War: ఇజ్రాయెల్-అమెరికన్-ఇరానియన్ యుద్ధం భీకరంగా జరుగుతుందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ, ఇది ట్రైలరే.. పిక్చర్ అభీ బాకీ హై అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో యుద్ధం నాలుగు నుండి ఐదు వారాల పాటు కొనసాగవచ్చని ఆయన కచ్చితంగా చెబుతున్నారు. అమెరికాకు ఎక్కువ కాలం కొనసాగే సామర్థ్యం ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Iran US War: అమెరికా సైన్యం ఇప్పటికీ ఇరాన్లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇంకా పూర్తి స్థాయి దాడిని ప్రారంభించలేదని అన్నారు. ఇరాన్పై అతిపెద్ద దాడి ఇంకా పెండింగ్లో ఉంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. దానిని ఉపయోగిస్తున్నాం అని వెల్లడించారు.
మూడోరోజు ఇలా..
యుద్ధంలో మూడో రోజు సోమవారం, ఇరాన్ నాలుగు మధ్యప్రాచ్య దేశాలలోని ఆరు అమెరికా స్థావరాలపై దాడి చేసింది. మూడు అమెరికా యుద్ధ విమానాలు కువైట్లో కూలిపోయాయి. కువైట్ యుద్ధ విమానాలను శత్రు విమానాలుగా తప్పుగా భావించి వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికన్ పైలట్లందరూ సురక్షితంగా ఉన్నారు.
Iran US War: మరోవైపు ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా అధికారి అలీ లారిజాని సోమవారం మాట్లాడుతూ, ఇరాన్ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపదని అన్నారు. ఇరాన్ అమెరికాతో చర్చలను పునఃప్రారంభించడానికి ప్రయత్నించిందనే రిపోర్ట్స్ నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
ఇరాన్లో 555 మంది మృతి, 740 మందికి గాయాలు..
అల్-జజీరా రిపోర్ట్స్ ప్రకారం, అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా 1,000 కి పైగా ఇరానియన్ లక్ష్యాలపై దాడి చేశాయి. మొదటి 30 గంటల్లో 2,000 కి పైగా బాంబులు ఇరాన్ పై పడ్డాయి.
ఇప్పటివరకు, 555 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారు. యుద్ధం మొదటి రోజు ఫిబ్రవరి 28న, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ బాంబు దాడిలో మరణించిన విషయం తెలిసిందే.
ఇది కాకుండా, యుఎస్ సెంట్రల్ ఫోర్సెస్ ప్రకటన ప్రకారం, ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 6 గురు అమెరికన్ సైనికులు మరణించారు.
కువైట్ పై ఇజ్రాయేల్ దాడులు..
Iran US War: కువైట్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి 178 బాలిస్టిక్ క్షిపణులు, 384 డ్రోన్లు దేశంపై ప్రయోగించారు. ఈ దాడుల్లో 27 మంది సైనికులు గాయపడ్డారు.
తన పౌరులకు అమెరికా సూచన..
తీవ్రమైన భద్రతా ప్రమాదాలు ఉన్నందున అమెరికన్లు వెంటనే చాలా మధ్యప్రాచ్య దేశాలను వాణిజ్య మార్గాల ద్వారా విడిచిపెట్టాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.
ఈ దేశాలలో బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, ఖతార్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ ఉన్నాయి.