సౌదీ అరేబియాలో రాజకుటుంబానికి చెందిన 150 మందికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబంలో 150 మంది వైరస్ బారినపడినట్లు అమెరికాకు చెందిన 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. రియాద్ గవర్నర్గా ఉన్న సౌదీ ప్రిన్స్ ఫైజల్ బిన్ బందర్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్కు కోవిడ్ సోకగా.. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
రాయల్ ఫ్యామిలీ సభ్యులకు కోవిడ్ సోకడంతో.. కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లోని డాక్టర్లకు హాస్పిటల్ వర్గాలు హై అలర్ట్ జారీ చేశాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. రాజ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి తమకు ఈ సమాచారం చెప్పారని తెలిపింది. అయితే వైరస్ సోకిన వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రాజ కుటుంబం, వారితో సన్నిహితంగా మెలిగే వారి కోసం ఇప్పటికే ఓ ఆసుపత్రిలో 500 పడకలను ఏర్పాటుచేశారు.