కరోనా కల్లోలంతో ప్రజలు చేతులు కలపడానికి జంకుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా వారి సంస్కృతి, అలవాట్ల పై కూడా చూపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వీడియోలో ఉన్న ఈ వ్యక్తి కరోనా భయంతో ముఖానికి మాస్క్ ధరించాడు. ఆయన స్నేహితులలో ఒకరు అతని వద్దకు వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వబోతుండగా నిరాకరించాడు. ఒక్క క్షణం ఆగి పునరాలోచనలో పడ్డాడు. వారికి వచ్చిన ఓ కొత్త ఆలోచన ప్రకారం కాలు కదుపుతూ లెగ్షేక్ ద్వారా గ్రీట్ చేసుకున్నారు. అనంతరం ఆ స్నేహితుడు తన దారిన తాను వెళ్లిపోతాడు. ఆ తరువాత ఆ వ్యక్తి మిగిలిన స్నేహితులను అదే స్టైల్లో పలకరించాడు.
కరోనా వ్యాపించకుండా లెగ్షేక్ ఇచ్చుకోవాలనే ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది అద్భుతమైన ఆలోచన అని అసలు కరోనా సద్దుమణిగిన తరువాత కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోవడం బెటరని కామెంట్లు చేస్తున్నారు.