కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి దారుణంగా మారింది. కరోనా మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే సామూహిక అంత్యక్రియలను నిర్వహించారు. ఒక్కరోజులోనే 10 వేల కేసులు నమోదు కావడంతో ఈ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 1,59,937కు పెరిగింది. న్యూయార్క్ రాష్ట్రంలోనే 7 వేలకు పైగా మరణాల నమోదయ్యాయి.