అఫ్గనిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం..
అఫ్గనిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
అఫ్గనిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘాంజీ ప్రావిన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంతో ఎంత మంది మరణించారు అనే దానిపై స్పష్టత రాలేదు. 83 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం తాలిబాన్ల ఉండే ప్రావిన్స్ లోని సడో ఖేల్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. సోమవారం 1:40 గంటల సమయంలో విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆఫ్గనిస్తాన్ లోని జాతీయ విమాన సంస్థ అరియానా ఎయిర్లైన్స్ ప్రమాద వార్తలను కొట్టిపారేసింది. తమ విమానాలు అన్ని బాగానే ఉన్నాయని వాటికి ఏ ప్రమాదం రాలేదని వెల్లడించింది. ఘాంజీ ప్రావిన్స్లో హిందూకుష్ పర్వతాల వద్ద మంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. గతంలో 2005లో అదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం జరిగింది. అనేక సార్లు సైనుకుల విమానలు కూలిపోయాయి.