Hyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్‌ మేళా..!

Hyderabad: ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు జాబ్‌ మేళాలు నిర్వహించేవి.

Update: 2022-06-26 08:19 GMT

Hyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్‌ మేళా..!

Hyderabad: ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు జాబ్‌ మేళాలు నిర్వహించేవి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ మేళలు జరుగుతున్నాయి. అదే విధంగా ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు కూడా జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. తాజాగా జూన్‌ 29న భారీ జాబ్‌మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో మొత్తం 15 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో దాదాపు 1500 మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

జాబ్‌ మేళలో పాల్గొనే కంపెనీలు

జాబ్‌ మేళాలో టీఎమ్‌ గ్రూప్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బిగ్‌ బాస్కెట్‌, విజయ డయగ్నోస్టిక్‌ సెంటర్‌, అపోలో ఫార్మసీ, ఎయిర్‌టెల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు పాల్గొంటాయి. జాబ్‌ మేళాకు హాజరయ్యే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్స్ జిరాక్స్‌ వెంట ఉండాలి.

ఇంటర్వ్యూలు ఎక్కడ..

ఈ జాబ్‌మేళా జూన్‌ 29న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను హెరిటేజ్‌ ప్యాలెస్‌, 1-47-908/4, ముషీరాబాద్‌ మెయిన్‌ రోడ్‌, ముషీరాబాద్‌, కావాడిగూడ, హైదరాబాద్‌-500020 అడ్రస్‌లో నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న నిర్వహించనున్న జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.


Tags:    

Similar News