దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అయన బయోపిక్ 'యాత్ర' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం అయన జన్మదినం సందర్బంగా చిత్ర నిర్వాహకులు టీజర్ ను రిలీజ్ చేశారు. గంటల వ్యవధిలో విడుదలైన ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఈ టీజర్ విడుదలైన 6 గంటల్లోనే రెండు లక్షల మంది వీక్షించడం గమనార్హం.. కాగా మళయాళ మెగాస్టార్ మమ్ముటీ వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి రాఘవ డైరెక్షన్లో 'యాత్ర' తెరకెక్కుతోంది.ఇక టీజర్ విషయానికొస్తే...పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమైంది. 'తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో... చరిత్రే నిర్ణయిస్తుంది' అంటూ సాగింది.